దివ్యాంగులకు రాయితీపై బస్ పాస్

దివ్యాంగులకు రాయితీపై బస్ పాస్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఆర్టీసీ  బస్సులలో ప్రయాణించడానికి దివ్యాంగులకు 50 శాతం రాయితీపై బస్ పాసులు ఇవ్వనున్నట్లు గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో తీసుకుని ఈ నెల మంగళ, శనివారాలలో మల్దకల్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆర్టీసీ ప్రతినిధులకు సంప్రదించాలని ఆయన కోరారు. ఒక సంవత్సరం పాటు 50% రాయితీ బస్ పాస్ ఇవ్వడం జరుగుతుందని మేనేజర్ తెలిపారు.