యఫ్ యస్ టీ వీ శుద్ధ కేంద్రంలో జరుగుతున్న పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

యఫ్ యస్ టీ వీ శుద్ధ కేంద్రంలో జరుగుతున్న పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని కొండపల్లి రోడ్డు సమీపంలో నూతనంగా రెండు కోట్లతో నిర్మిస్తున్న  యఫ్ యస్ టీ వీ శుద్ధ కేంద్రంలో జరుగుతున్న పనులను మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, గురువారం పరిలించడం జరిగింది. ఈ సందర్బంగా యఫ్ యస్ టీ వీ శుద్ధ కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ నెల చివరిలో పనులను మొత్తం పూర్తి చేసిన వెంటనే గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని. మున్సిపల్ చైర్మన్ కేశవ్ తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ టీ.శ్రీను బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు భగీరథవంశీ రిజ్వాన్ మున్సిపల్ అధికారులు డి.ఇ ఏ.ఇ తదితరులు పాల్గొన్నారు.