రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్

రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల: పవిత్రమైన రంజాన్ పండుగ వేడుకల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్. పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని శనివారం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన వేడుకల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్. ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్  మాట్లాడుతూ...

ముస్లిం సోదరులు అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ ఎంతో భక్తిశ్రద్ధలతో, ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన, ఉపవాసాలతో అల్లాను ఆరాధించి కొలుస్తారని అన్నారు. గద్వాల పట్టణంలోని ఈద్గా  వద్ద (ఈద్- ఉల్ ఫితర్ ) రంజాన్ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముస్లిం సోదరులు అందరూ దాదాపు నెల రోజులపాటు మహమ్మద్ ప్రవక్త బోధనలు పాటించి, ఉపవాసాల దీక్షలు చేసే అతి పవిత్రమైన పండుగ రంజాన్ అని అన్నారు. సక్రమ మార్గంలో నడుచుకుంటూ, గౌరవంగా దేవుని యందు భక్తి విశ్వాసము కలవారికి పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుందని, ముస్లిం సోదరులు ఒకరికొకరు గౌరవించుకొని ఆలింగనం చేసుకొని ఈ పవిత్రమైన రోజు ధర్మం, దానం, క్రమశిక్షణ నేర్పే పర్వదినం రంజాన్ పండుగ అని అన్నారు. ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు రంగస్వామి, ఎర్ర శ్రీనివాస్, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవింద్, ఉపాధ్యక్షుడు మునెప్ప, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్,కార్యదర్శి తిమ్మప్ప, నాయకులు భూపతి నాయుడు, చింత కిష్టన్న, ఆశన్న, చిన్న రాముడు,సర్వేష్, రమేష్, కె.టి.దొడ్డి మండల నాయకులు అంజి,వీరేష్ తదితరులు పాల్గొన్నారు.