మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలి

మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మొక్కజొన్న రైతులపై  ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు అలంపూర్ నియోజకవర్గం లో మొక్కజొన్న ను కొనుగోలు చేయకపోవడంతో పొలాల వద్దే రైతులు తమ పంటలతో పడిగాపులు కాస్తున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను నట్టేట ముంచడం తగదు. రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన పోరాటం చేస్తాం. దాదాపు అలంపూర్ లో 35వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. 
కొనుగోలు కేంద్రాలు లేక వ్యవసాయ పొలాల దగ్గర ఉన్న మొక్కజొన్న ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయాయి వాటిని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

ప్రభుత్వ గిట్టుబాటు ధర 1962 రూపాయలు ఉండగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక, వడ్డీలు భరించలేక చాలామంది  రైతులకు తమ పంటలను తక్కువ ధరకే అమ్ముకుంటూ అప్పల పాలవుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నలు కొనాలి.