మద్యం త్రాగి వాహనాలు నడిపే వారి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీస్ అధికారులు

మద్యం త్రాగి వాహనాలు నడిపే వారి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీస్ అధికారులు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు జిల్లా కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ జిల్లా ఎస్పీ. కె. సృజన, ఆదేశాల మేరకు డి. ఎస్పీ. ఎన్. సి హెచ్. రంగస్వామి, పర్యవేక్షణలో గద్వాల్ సి. ఐ చంద్ర శేఖర్, అధ్వర్యంలో గద్వాల్ పట్టణ ప్రాంతాలలో మద్యం త్రాగి వాహనాలు నడిపే వారి పై  స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.  ఈ స్పెషల్ డ్రైవ్ లో గద్వాల్ పట్టణ ఎస్సై సూకుర్, ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్, పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్పీ మాట్లాడుతూ.. మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వాహన దారులు మద్యపానం సేవించి వాహనాలు నడపరాదని మద్యపానం సేవించి వాహనాలు నడిపే వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

మూడు ఛాలాన్స్ అంత  కంటే ఎక్కువ గా పెండింగ్ చాలెన్స్ ఉంటే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని కావున పెండింగ్లో ఉన్న చానల్స్ ని వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు. వాహనదారులు పెండింగ్లో ఉన్న చాలన్స్ ని వెంటనే మీ దగ్గరలో ఉన్న మీసేవ కేంద్రాల్లో క్లియర్ చేసుకోవాలని వాహనదారులకు  సూచించారు, అలాగే నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలకు వెంటనే నెంబర్ ప్లేట్లు వేయించుకోవాలని తెలిపారు.   లేనియెడల వాహనాలు దొంగతనాల గురి అయ్యే అవకాశం ఉందని అన్నారు.  వాహనదారులు తప్పకుండా క్రింది ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదు. వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించవలెను.

మద్యం సేవించి వాహనం నడపరాదు. వాహనదారులు రోడ్డుపై వాహనాలను పార్కు చేయరాదు. టూ వీలర్స్ పై ఇద్దరకు మించి ప్రయాణించరాదు.ఆటోలలో ఎక్కువ మంది పిల్లలను. కూలీలను ఎక్కించుకోరాదు. ఆటోలో సీట్ పర్మిట్ ఉన్నంతవరకే ప్యాసింజర్ ఎక్కించుకోవాలి. డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడరాదు. రాష్ డ్రైవింగ్ చేయరాదు. పరిమిత వేగంలో వాహనాలు నడపాలి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీస్ వారికి సహకరించాలని డి.ఎస్పీ. తెలిపారు.