ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ  పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ  పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేడ్ మార్కెట్ నిర్మాణ పనులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పరిశీలించారు.
   
ఎమ్మెల్యే మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్. సహకారంతో గద్వాలకు ఇంటిగ్రేట్ మార్కెట్ ఏర్పాటుతో చేయడం జరిగింది.  వెజ్, నాన్ వెజ్, సూపర్ మార్కెట్, కిరాణం, జనరల్ స్టోర్ తో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరగా పనులను పూర్తి చేసి ప్రజల్లోకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటిగ్రేడ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, ఎంపీపి రాజారెడ్డి, కౌన్సిలర్ శ్రీను, మల్డకల్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు భగీరథ వంశీ, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.