1లక్ష రూపాయల యల్ ఓ సి లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ లోని 6వ వార్డ్ కి చెందిన ఎన్.జయశ్రీ భర్త ఎన్.రవి కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష రూపాయల యల్ ఓ సి లెటర్ ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణ శెట్టి, నారాయణ ఖాజా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.