ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎవిఎన్. రెడ్డి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎవిఎన్. రెడ్డి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, అధ్యాపక ఉమ్మడి సంఘాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏ. వెంకట్ నారాయణ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలను పరిష్కరిస్తానని, ఏళ్ళ తరబడి పెండింగ్ లో వున్న బదిలీలను చేపట్టెందుకు కృషి చేస్తానని అన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు పార్టీ కార్యాలయాలలో క్యాంప్ ఆఫీస్ లు పెట్టుకున్నారని అలా కాకుండగా నన్ను గెలిపిస్తే సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయ అధ్యాపకులకు ఓ సపరేట్ క్యాంప్ కార్యాలయం తెరిచి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా తెలియపరచ్చేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకువస్తానని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను ఎవిఎన్. రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో టీపీయు ఎస్  సంఘం సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు