పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకోవడానికి వచ్చారని పరిగెత్తి చనిపోయిన యువకుడు

పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకోవడానికి వచ్చారని పరిగెత్తి చనిపోయిన యువకుడు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల మండలం కుర్వపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు పట్టుకోవడానికి వచ్చారన్న భయంతో పొలాల్లోకి పరిగెత్తిన యువకుడు గోపాల్ (28) గుండెపోటు తో చనిపోయాడు. నిన్న రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు దాడికి వచ్చారని ఆ సమయంలో భయంతో గోపాల్ పరిగెత్తడంతో దొడ్లల్లో అక్కడికక్కడే చనిపోయాడని, ఉదయం పనుల నిమిత్తం దొడ్లల్లోకి గ్రామస్తుడు వెళ్లగా అక్కడే పడి వున్న గోపాల్ ను చూసి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియచేశాడు.ఈ దాడులు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసినట్టు సమాచారం.