పేదింటి బిడ్డకు పుస్తే మట్టెల పంపిణీ

పేదింటి బిడ్డకు పుస్తే మట్టెల పంపిణీ

ముద్ర,తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దేనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క శంకరయ్య కూతురు ఊర్మిల వివాహానికి తన వంతు సహాయంగా శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ పుస్తె మట్టెలు పంపిణీ చేశారు. జిల్లాలోని నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయంగా చేస్తున్న కృషికి నక్క విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సిరిసిల్ల రాజేశం,పోగులా రాము,గుండెల్లి వేణుగోపాల్, తడక విజయ్ కుమార్, పాల్గొన్నారు