నిరుపేద వరుని కుటుంబానికి బియ్యం అందజేసిన : కాంగ్రెస్ పార్టీ

నిరుపేద వరుని కుటుంబానికి బియ్యం అందజేసిన : కాంగ్రెస్ పార్టీ

ముద్ర, ఎల్లారెడ్దిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన సనుగుల కుమార్ వివాహానికి శుక్రవారం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య 50 కిలోల బియ్యం వితరణ చేశారు.  సనుగుల కుమార్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా తనంతట తానుగా ఎదిగి వచ్చి వివాహం చేసుకోవడం జరిగిందని దీనికి తమ వంతు సహాయంగా ఈ బియ్యాన్ని అందించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, నాయకులు మానుక నాగరాజు, గంట బుచ్చా గౌడ్, పందిర్ల శ్రీనివాస్, ప్రశాంత్  పాల్గొన్నారు