ఘనంగా గిరిజన మహోత్సవం...
![ఘనంగా గిరిజన మహోత్సవం...](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_648e930d01c5b.jpg)
ముద్ర, రుద్రoగి:- తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలం దెగవత్ తండా గ్రామంలో శనివారం గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పకడ్బందీగా ప్రణాళికలను అమలు చేసి గిరిజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.స్వయం పాలనే ధ్యేయంగా తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, బారాసమండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి, సర్పంచ్, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు...