ఖాసీం రాజ్వీని మించిన నియంత కేసీఆర్ : డీకే అరుణ

ఖాసీం రాజ్వీని మించిన నియంత కేసీఆర్ : డీకే అరుణ

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి - గద్వాల : పేపర్ల లీకేజీ కేసులో దోషులను వదిలేసి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడం. అప్రజాస్వామిక మని జోగులాంబ గద్వాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గురువారం ఒక ప్రకటన ద్వారా అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్. ఖాసీం రాజ్వీని మించిన నియంతగా మారిపోయారన్నారు.పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతగాని కేసీఆర్. ప్రభుత్వం ప్రశ్నించేవాళ్ల గొంతు నొక్కుతోందని ఫైర్ అయ్యారు. భేషరతుగా బీజేవైఎం కార్యకర్తను విడుదల చేయాలన్నారు