ఎమ్మెల్యే కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన  కౌన్సిలర్స్ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు

ఎమ్మెల్యే కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన  కౌన్సిలర్స్ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలుగు నామ సంవత్సరం ఉగాది పండగ పర్వదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి కౌన్సిలర్ మురళి, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు పాండు, పుష్పగుచ్చం ఇచ్చి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, రైస్ మిల్ అసోసియేషన్ కోశాధికారి సుదర్శన్  శెట్టి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు భగీరథ వంశీ, కురుమన్న సీతారాములు, రాజు  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.