ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  40 ధరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎంతో దూరం నుండి  వ్యయప్రయాసలకోర్చి సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కి వస్తున్న ప్రతిఒక్కరి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని అన్నారు.  దరఖాస్తులతో వచ్చే అర్జీదారుల ద్వారా వారి సమస్యలను గురించి తెలుసుకుంటు, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 40 దరఖాస్తులను స్వీకరించగా అందులో ఆసరా పెన్షన్ కు సంబంధించి 2, భూ సమస్యలపై 38   ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్,  ఆర్డిఓ రాములు, ఏ ఓ యాదగిరి,సూపరిడెంట్ మదన్ మోహన్, జిల్లా అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.