నూతన బస్టాండ్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

నూతన బస్టాండ్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలో పునర్ నిర్మాణం అవుతున్న కొత్త బస్టాండ్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే కృష్ణ మొహన్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్త బస్టాండ్ ఆధునిక హంగులు, అన్ని సౌకర్యాలతో నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.ఎస్.కేశవ్, నాయకులు పాల్గొన్నారు.