నిన్న కాంగ్రెస్.. ఈ రోజు బీఆర్ఎస్

నిన్న కాంగ్రెస్.. ఈ రోజు బీఆర్ఎస్
  • కాంగ్రెస్ లో చేరిన 24 గంటల్లోనే చక్రం తిప్పిన బీఆర్ఎస్ నేతలు
  • పెద్దూర్ తురకాశీకాలనీలో బీఆర్ఎస్ నేతల బుజ్జగింపులు
  • తిరిగి బీఆర్ఎస్ కండువాలు వేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్న నాయకులు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల :రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9 వార్డులో బీఆర్ఎస్ పార్టీ నేతల తీరుకు వ్యతిరేఖంగా.. తమ కాలనీ సమస్యలు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి ఆద్వర్యంలో శనివారం జాయినింగ్ జరిగితే .. తేరుకున్న బీఆర్ఎస్ నేతలు ఓజ్జల అగ్గిరాములు, కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారయణ లు కాలనీకి వెళ్లి నాయకుల తీరుకు వ్యతిరేఖంగా ఉన్న వారిని బుజ్జగించారు. 24 గంటల గడవక ముందే కాంగ్రెస్ లో చేరిన వారికి తిరిగి గూలాబి కండువాలు వేసి బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చిత్ర విచిత్రంగా కొనసాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.