సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు వడ్డెర సంఘం సంపూర్ణ మద్దతు

తంగళ్లపల్లి మంత్రి కేటీఆర్ ఎన్నికల ఖర్చు కోసం రూ.10,116/ అందజేత

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలం  వడ్డెర సంఘం అసెంబ్లీ ఎన్నికల్లో  మంత్రి కేటీఆర్ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన చేశారు.తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇంపీరియల్ గార్డెన్ లో వడ్డెర సంఘం సభ్యులు సమావేశమయ్యి.. మంత్రి కేటీఆర్ను మరోసారి అత్యధిక మేజార్టీతో గెలిపించుకోవాలని తీర్మాణం చేశారు. బీఆర్ఎస్  మన ఓట్లు అంటూ శపధం చేశారు.మంత్రి కేటీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని, సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతూ తీర్మానం చేశామని వడ్డెర సంఘ మండల అధ్యక్షుడు దేవయ్య ,సభ్యులు,నేతలు పేర్కొన్నారు.వడ్డెర సంఘం తీర్మానాన్ని స్వాగతిస్తూ అభినందించిన బి అర్ ఎస్ సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ కు రూ.10,116 లు అందించి మంత్రి కేటీఆర్ ఎన్నికల ఖర్చు కోసం తాము విరాళం ఇస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, సర్పంచ్ అంకారపు అనిత, ఎంపీ టీ సి కోడి అంత య్య, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, పడి గెల రాజు, ఏయంసి డైరెక్టర్ సద్దా రోజా, కొడం సంధ్య రాణి, వడ్డెర సంఘ నేతలు, సభ్యులు, మహిళ లు ఉన్నారు.