మైనార్టీలు ఆరోగ్యశ్రీ, కేవైసీ సద్వినియోగం చేసుకోండి

మైనార్టీలు ఆరోగ్యశ్రీ, కేవైసీ సద్వినియోగం చేసుకోండి

ముద్ర,ఎల్లారెడ్డిపేట : అర్హులైన మైనార్టీలు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు కేవైసీ  చేసుకోవాలని సయ్యద్ షరీఫ్ సూచించారు. ఎల్లారెడ్డిపేట లో మైనార్టీ ఉమ్మడి మండల యూత్ కమిటీ ఆధ్వర్యంలో రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు కేవైసీ ఉచిత నమోదు కార్యక్రమాన్ని ఆదివారం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండల ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు  షరీఫ్ మాట్లాడుతూ 65 మందికి ఆరోగ్యశ్రీ,కేవైసీ చేయించామని  రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి సెంటర్ నిర్వాహకులు ఆదిత్య, ముస్లిం కమిటీ సభ్యులు రిజ్వాన్, రహీం, యామిన్ భాష, తాజ్,హలీం,రజాక్, దర్వేష్ తదితరులు పాల్గొన్నారు.