తండ్రి జయంతి తనయుడు మా వృద్ధాశ్రమంలో బియ్యం, సరుకుల అందజేత 

తండ్రి జయంతి తనయుడు మా వృద్ధాశ్రమంలో బియ్యం, సరుకుల అందజేత 
  • స్వర్గీయ వంగ రామేశ్వర్ రెడ్డి జయంతి సందర్భంగా

 ముద్ర,ఎల్లారెడ్డిపేట:తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని తనయుడు మా వృద్ధ అభాగ్యుల వృద్ధాశ్రమంలో బియ్యం, నిత్యవసర సరుకులను అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన విశ్రాంతి ఉద్యోగి స్వర్గీయ వంగ రామేశ్వర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా తనయుడు వంగ గిరిధర్ రెడ్డి మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని మల్లు గారి నర్సాగౌడ్  ఏర్పాటుచేసిన మా వృద్ధాశ్రమంలో సన్నిహితులతో కలిసి 30 మంది వృద్ధులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను మల్లు గారి నర్సాగౌడ్ సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, నూకల శ్రీను, నేవూరి సురేందర్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.