గుండెపోటుతో గ్రామపంచాయతీ కార్మికుని మృతి

గుండెపోటుతో గ్రామపంచాయతీ కార్మికుని మృతి

ముద్ర,ఎల్లారెడ్డిపేట :గుండెపోటుతో గ్రామపంచాయతీ కార్మికుడు బొమ్మిడి కొండయ్య 45 మృతి చెందాడు.  సింగారం గ్రామానికి చెందిన బొమ్మిడి కొండయ్య గ్రామపంచాయతీలో  విధులు నిర్వహిస్తున్నాడు.  బుధవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత భోజన అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోగా వెంటనే కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనై దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్య పుష్ప, కుమారుడు ప్రశాంత్ కూతురు ప్రణీతలు ఉన్నారు. గ్రామస్తులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.