అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత
ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రేమ్ దీప్ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న TS02UB2193 నెంబర్ గల లారీని ఆపి సంబంధిత పత్రాలు చూపమని అడగగా లారీ డ్రైవర్ దాడి మల్లేష్ 37 ను అడుగగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని నిర్ధారించుకున్న పోలీసులు లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  లారీ ఓనర్ కొదురుపాక కు చెందిన అనుముల శ్రీకాంత్,  డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్ దీప్ పేర్కొన్నారు.