అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు...
![అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రు...](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652568c2e2ea5.jpg)
ముద్ర, గంభీరావుపేట : ఎలాంటి సర్వే చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇవ్వడం ఆప్రజాస్వామ్యకమని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముద్రకొల ఆంజనేయులు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోనీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ పై రీ సర్వే చేయాలని తాసిల్దార్ భూపతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంభీరావుపేట గ్రామంలో ఇండ్లు,భూమి ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు.
ఎలాంటి సర్వే చేయకుండానే పంపిణీ చేయడంతో అసలైన అర్హులు కు అన్యాయం జరిగిందని అన్నారు. అధికారులు రి సర్వే చేసి అనర్హులను గుర్తించి, వారి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్వాధీనం చేసుకోవాలని అన్నారు. గంభీరావుపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం పేద ప్రజలు ఆందోళన చేస్తున్న ఎంపీపీ, జడ్పిటిసి స్పందించకపోవడం దారుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రవీణ్, ఖరీం, రాజు, శోభ, రమా, సునీత, కళావతి, భాగ్యలక్ష్మి,సోనీ,పద్మ, కిష్టవ్వ,భారతమ్మ, దేవ, రజియా, లక్ష్మి, లత, స్రవంతి, విజయ, మౌనిక, పారహన, లత, భారతి. తదితరులు పాల్గొన్నారు.