ఘనంగా తండా గిరిజనోత్సవం

ఘనంగా తండా గిరిజనోత్సవం
  • పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్

ముద్ర,ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలోని శనివారం గిరిజన దినోత్సవం సందర్భంగా తండా ప్రజలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు.  తండా సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయాలతో ర్యాలీ తో పాటు బోగ్ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొని తండాలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీఓ వజీర్, ఉప సర్పంచ్ పద్మ మోహన్,  వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.