ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం...

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం...

ముద్ర, ముస్తాబాద్: మామూలుగా ఒక కాన్సులో ఒకరు లేదా ఇద్దరు మహా అయితే ముగ్గురు శిశువులు జన్మించారని వింటుంటాం కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్సులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టెముక్కల లావణ్య  పురటి నొప్పులు రాగా , ముస్తా బాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్ కు తరలించి, ఆపరేషన్ నిర్వహించాగా, ముగ్గురు శిశువుల తో పాటు ఒక ఆడబిడ్డ  కి జన్మనిచ్చింది. డాక్టర్ శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి తల్లి , పిల్లలు క్షేమంగా  ఉన్నారని, ఇది అరుదైన శస్త్ర చికిత్స అని,పదిలక్షల కేసుల్లో ఇలాంటివి అరుదుగా జరుగుతాయని తెలిపారు.పిల్లలకి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేటలోని  ఓ ప్రైవేట్  పిల్లల హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్ అఖిల (గైనకాలజిస్ట్ ) డాక్టర్ తేజస్వీ (సర్జన్ )డాక్టర్ ప్రతాప్ (ఎనస్థీషియాలు) పాల్గొన్నారు