ప్రగతి భవన్ కు భూమి పూజ
![ప్రగతి భవన్ కు భూమి పూజ](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651d4755bb1c9.jpg)
- 20 లక్షల వ్యయంతో నిర్మాణం
ముద్ర,ఎల్లారెడ్డిపేట :ప్రగతి భవన్ నిర్మాణానికి బుధవారం స్థానిక సర్పంచ్ అమృత, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు లతో కలిసి భూమి పూజ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో 20 లక్షల వ్యాయంతో ప్రగతి భవనను నిర్మిస్తున్నామని ఎంపీపీ రేణుక అన్నారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న మహనీయుడు అని కొనియాడారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో అందుతున్నాయని గుర్తు చేశారు. రానున్న శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు జంగిడి సత్తయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, డైరెక్టర్ మెండే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.