యువత మేల్కొనాలి      

యువత మేల్కొనాలి      
  •  కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి

ముద్ర, ఎల్లారెడ్దిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లో యువత మేల్కోవాలని నియోజకవర్గపు ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పధిర బస్టాండ్ లో యువకులతో మాట్లాడారు. రానున్న ఎన్నికలలో యువతకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేయడం జరుగుతుందని అన్నారు.ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎదిరించాలని యువత ముందుండి కొట్లాడాలని పిలుపునిచ్చారు.ఈ ప్రభుత్వం యువకులను ఉద్యోగాల భర్తీలో ఉపాధి హామీ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం యువత చదువుకుంటున్న సమయంలో ఫీజు రియంబర్స్మెంట్   లేకుండా చేస్తుందన్నారు. పదవ తరగతి వరకూ విద్యార్థులకు స్కాలర్షిప్  లు కూడా ఇవ్వడం లేదన్నారు. యువత తిరగబడితేనే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్,నాయకులు దొమ్మాటి నరసయ్య, చెన్ని బాబు, చెరుకు ఎల్లయ్య,యువకులు పాల్గొన్నారు.