ముద్రకు స్పందన చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా
![ముద్రకు స్పందన చెట్టును నరికిన వ్యక్తికి జరిమానా](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647d98065a6c5.jpg)
- నాటిన చెట్లను నరికితే కఠినమైన చర్యలు
- ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఈవో
ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై హరితహారంలో భాగంగా నాటిన చెట్టును నిన్న రాత్రి అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన రియాల్టర్ బాలయ్య అపార్ట్మెంట్ ముందు ఉన్న చెట్టును నరికి వేశారు. రాత్రిపూట హరితహారం చెట్లను నరికివేత ముద్ర లో కథనం ప్రచురితం కాగ వెంటనే స్పందించిన ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఈవో సోమవారం వెయ్యి జరిమానా విధించారు.చెట్లను నరికి వేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు.