దళిత కుటుంబల్లో వెలుగలు నింపడమే ముఖ్యమంత్రి లక్ష్యం:వేములవాడ ఎమ్మెల్యే చెన్నామనేని రమేష్ బాబు.

దళిత కుటుంబల్లో వెలుగలు నింపడమే ముఖ్యమంత్రి లక్ష్యం:వేములవాడ ఎమ్మెల్యే చెన్నామనేని రమేష్ బాబు.
Vemulawada MLA Chennamaneni Ramesh Babu

ముద్ర,వేములవాడ: దళిత కుటుంబల్లో వెలుగలు నింపడమే ముఖ్యమంత్రి లక్ష్యం అని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు.ఆదివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మల్లారం బస్టాండ్ సమీపంలో దళిత బంధు స్కీము ద్వారా ఏర్పాటు చేసుకున్న సహస్ర మినీ సూపర్ మార్కెట్ను ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 100 యూనిట్లను 10 కోట్లతో పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందన్నారని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం అన్నారు.