కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ

ముద్ర, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యలతో కూడిన కరపత్రాలను సోమవారం ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కరపత్రాలను అందజేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ కాలేదని అన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని వాగ్దానం చేసిన మాట నెరవేర్చలేదన్నారు. రైతులకు వరి పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని నెల రోజులు గడిచిన జమ చేయలేదని పేర్కొన్నారు.రైతు వేదికలను రాజకీయాల కోసం వాడుకోవడం అన్యాయమని తదితర అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కరపత్రాలను పంపిణీ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో మామిండ్ల కిషన్, దేవచంద్రం,నగేష్, బుచ్చి రాములు,  నరసయ్య,  భూమ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.