సిసిఎల్ మంజూరు చేయండి...

సిసిఎల్ మంజూరు చేయండి...
  • డీఈఓ కు వినతి పత్రం అందజేత..
  • టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: నూతనంగా జిల్లా కి ఎస్ఎస్సి స్పాట్ కేంద్రం ఏర్పాటు కాబడి విజయవంతముగా పూర్తి చేయడం పట్ల టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భముగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23 నుండి 26 వరకు 4 రోజుల పాటు జిల్లాలో మొదటి సరిగా స్పాట్ క్యాంప్ నిర్వహించి విజయవంతం చేయడం సంతోషం అని,అలాగే ఇట్టి స్పాట్ లో ఆదివారం రోజున ఉపాధ్యాయులు పాల్గొని విధులు నిర్వర్తించినందున,ఆ రోజుకి ప్రత్యామ్నాయముగా సిసిల్ (పరిహార సాధారణ సెలవు) ని మంజూరు చేయాలని డీ ఈ వో కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షడు దోర్నాల భూపాల్ రెడ్టి ,ప్రధాన కార్యదర్శులు ,దుమాల రమానాథ్ రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.