నిప్పు అంటుకున్న కొయ్య కాళ్లు

నిప్పు అంటుకున్న కొయ్య కాళ్లు
  • గుడిసె దగ్ధం
  • ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పుతున్న సిబ్బంది
  • సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి 

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గురువారం భక్తి సంఘం  వెనుకాల ఉన్న పొలాలలో కొయ్య కాళ్లు నిప్పంటుకొని  సుమారు 30 ఎకరాల పెట్టు దగ్ధమైంది. బందారపు దేవేందర్ రెడ్డి   రైతుకు సంబంధించిన గుడిసె పూర్తిగా దగ్ధం కాగా  సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని  మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ జిల్లా ఫైర్ ఇంజన్ శాఖకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పుతున్నారు. సమాచారం తెలుసుకొని  సంఘటన స్థలానికి   సింగిల్ విండో అధ్యక్షులు గుండారం కృష్ణారెడ్డి చేరుకొని  దగ్ధమైన గుడిసెను పరిశీలించగా  గుడిసెలో వ్యవసాయానికి సంబంధించిన అస్తి పైపులు పూర్తిగా దగ్ధమయ్యాయని బాధితుడు దేవేందర్ రెడ్డి   తెలుపగా వెంటనే స్థానిక తహసిల్దార్ జయంతి కుమార్ తో ఫోన్లో జరిగిన నష్టాన్ని వివరించారు.