భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసిన రేవంత్​ రెడ్డి

భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసిన రేవంత్​ రెడ్డి

మునుగోడు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కాంగ్రెస్​కు పాతిక కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ చేసిన ఆరోపణలకు సంబంధించి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటూ టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి చార్మినార్​ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. ఈటల రావాలని సవాల్​ చేసినా ఆయన రాలేదు.

రేవంత్​ రెడ్డి రాకతో భాగ్యలక్ష్మి అలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. రేవంత్​ సవాల్​ పై స్పందించకూడదని ఈటల నిర్ణయించుకున్నారు. ఈటల కోసం ఆలయం దగ్గర  రేవంత్​ రెడ్డి నిరీక్షించారు. తాను రేవంత్​పై వ్యక్తిగతంగా మాట్లాడలేదన్న ఈటల రాజేందర్​. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడానన్నారు. ఆత్మసాక్షిగానే చెప్పానన్నారు. తాను ఎవరినీ కించపరిచే వ్యక్తిని కాదన్నారు.