భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి
మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు పాతిక కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలకు సంబంధించి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. ఈటల రావాలని సవాల్ చేసినా ఆయన రాలేదు.
రేవంత్ రెడ్డి రాకతో భాగ్యలక్ష్మి అలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. రేవంత్ సవాల్ పై స్పందించకూడదని ఈటల నిర్ణయించుకున్నారు. ఈటల కోసం ఆలయం దగ్గర రేవంత్ రెడ్డి నిరీక్షించారు. తాను రేవంత్పై వ్యక్తిగతంగా మాట్లాడలేదన్న ఈటల రాజేందర్. ప్రజల కోసం, ధర్మం కోసం మాట్లాడానన్నారు. ఆత్మసాక్షిగానే చెప్పానన్నారు. తాను ఎవరినీ కించపరిచే వ్యక్తిని కాదన్నారు.