వెయిట్ లాస్ పేరుతో విద్యుత్ షాకులు..!
- నిర్లక్షపు థెరపీతో ప్రాణాలకు ముప్పు తెస్తున్న COLORS..!
- బరువు తగ్గడం కోసం..ప్రాణాల మీదకు తెచ్చుకున్న మహిళ..
- ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న..కలర్స్ సంస్థ..
- కలర్స్ సంస్థను మూసివేయాలని డిమాండ్ చేస్తున్న బాధితురాలి కుటుంబసభ్యులు..
- సికింద్రాబాద్ కార్ఖానాకి చెందిన మహేశ్వరి ( 30 ) అశోక్ దంపతులు..
- నిరుపేద కుటుంబం.. భర్త అశోక్ ప్రైవేట్ ఉద్యోగి.
- 81 కేజీలు ఉండే..మహేశ్వరి..బరువు తగ్గేందుకు కార్ఖానా కలర్స్ లో ట్రీట్మెంట్.
- టీవీల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి ఆకర్షితురాలైన మహేశ్వరి.
- 15 KG లి తగ్గిస్తామన్న.. కలర్స్ సిబ్బంది.
40వేల package లోముందుగా ఈనెల 15 న 7000 రూపాయలు కట్టి జాయిన్ అయిన బాధితురాలు మహేశ్వరి. మొదటి రోజు మసాజ్..2 వ రోజు ఎలక్ట్రిక్ వైబ్రేట్ మెషిన్ తో ట్రీట్మెంట్ చేసిన సిబ్బంది. దీంతో ఆమెకు వాంతులు..మాములే అంటూ సర్ది చెప్పిన కలర్స్ సిబ్బంది. ఈ నెల 21 న మరోసారి పిలిచి.. ఎలక్ట్రిక్ వైబ్రేట్ పెట్టిన సిబ్బంది.. వాంతులు , కడుపులో నొప్పితో.. కలర్స్ కార్యాలయంలోని వాష్ రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయిన మహేశ్వరి. అయినా పట్టించుకోని కలర్స్ యాజమాన్యం, సిబ్బంది.. తోటివారి సమాచారంతో..భర్త , బంధువులు మహేశ్వరి ని స్థానిక నవజీవన్ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి.. ఆందోళనకరంగా ఉందన్న వైద్యులు. దీంతో భర్త, ఆమె సోదరి.. బంధువులు ఆందోళన. బరువు తగ్గిస్తామని ప్రాణాల మీదకు తెచ్చిన..కలర్స్ సంస్థను మూసివేయాలని డిమాండ్. కార్ఖానా పోలీసులకు పిర్యాదు చేసిన బాధిత బంధువులు..!.