విద్యుత్ ఘాత్కానికి విద్యార్థిని మృతి

విద్యుత్ ఘాత్కానికి విద్యార్థిని మృతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: మల్దకల్ మండలం పెద్దపల్లిలో సోమవారం ఉదయం కరెంట్ షాక్ గురై విద్యార్థిని మృతి చెందింది. గ్రామస్తుల వివరాల మేరకు. గ్రామానికి చెందిన కిష్టన్న కుతూరు పావని (15) ఇంట్లో వాటర్ హీటర్ పెట్టిన బకెట్ ను ప్రమాదవశాత్తు తాకడంతో షాక్కు గురైంది. వెంటనే గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.