అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్

అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర గీతం పై వివాదం కొనసాగుతోంది. మన తెలంగాణ రాష్ట్రం మన పాట అంటూ తెలంగాణ వాదులు తమ గొంతుకను వినిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే.. అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ రంగంలోకి దిగారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తున్నామంటోంది మిట్టపల్లి టీం. తెలంగాణ పాటకు మిట్టపల్లి మార్క్ ఉండబోతుందని ప్రకటించింది మిట్టపల్లి టీం.