శ్రీధర్ రెడ్డి హత్య పై సీబీఐ విచారణ చేపట్టాలి

శ్రీధర్ రెడ్డి హత్య పై సీబీఐ విచారణ చేపట్టాలి

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం చిన్నంబావి మండల మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన సంఘటన స్థలాన్ని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకొని చిన్నంబాయి చౌరస్తా నుండి లక్ష్మి పల్లి వరకు భారీ ఊరేగింపుగా వెళ్లారు అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి  హత్య  ముమ్మాటికి రాజకీయ హత్య అని అన్నారు.

శ్రీధర్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదల గిట్టని కొందరు వ్యక్తులు రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రోద్బలంతోనే హత్య చేశారని,శ్రీధర్ రెడ్డి హత్యపై సిబిఐ విచారణ చేపట్టి సంబంధిత రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావునీ బర్తప్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న సీటు లేదా జ్యూడిషన్ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

స్పందించకుంటే మంత్రులు నాయకుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. టిఆర్ఎస్ కార్యకర్త లు ఎవరు అధైర్య పడుద్దని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కార్యకర్తలు తదితరులు ఉన్నారు