ఐదవ శక్తిపీఠం  శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయ అభివృద్ధి  దేశంలోనే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్:వల్లూరు క్రాంతి

ఐదవ శక్తిపీఠం  శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయ అభివృద్ధి  దేశంలోనే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్:వల్లూరు క్రాంతి

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి :అలంపూర్ లో విరాజీళ్లుతున్న ఐదవ శక్తిపీఠం  ప్రసాద్ స్కీం క్రింద జరిగే అభివృది పనులను త్వరితిగతిన పూర్తి చేయాలనీ అధికారులను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశించారు. ప్రసాద్ స్కీం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి నాణ్యత ను పరిశీలించారు.
ఈ మేరకు ముందుగా ఆలంపూర్ నవబ్రహ్మ ఆలయాల దగ్గర ప్రసాద్ స్కీం కింద చేపట్టాల్సిన ప్రహరీ గోడ నిర్మాణానికి ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పార్కింగ్ స్థలం దగ్గర నుండి సమీపంలోని గ్రామ కంఠంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. నవబ్రహ్మాలయాల పార్కింగ్ స్థలంలో భక్తులు సేద తీరేందుకు పబ్లిక్ ఎమినిటి సెంటర్  నిర్మాణం చేసేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఆలయ ఇఓ పురంధర్ కుమార్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సంబంధిత ఆర్కియాలజికల్ అసిస్టెంట్ సూపరిడెంటెంటెడ్ రోహిణి తో మాట్లాడుతూ దేవస్థానం కు సంబంధించి సంబంధిత పురవస్తు శాఖ వారికి లేఖ రాసి డైరెక్టర్ జనరల్ తో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందంటూ ఆమెతో పేర్కొన్నారు.


అనంతరం పార్కింగ్ టైల్స్, ఐమాక్స్ లైట్స్ ఏర్పాటుకు వస్తున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పర్యాటక ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ విగ్రహాన్ని తిలకించారు. వాటి చారిత్రక విశేషాలు ఆలయ అసిస్టెంట్ రంగనాథ్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగి సంజీవ నాయుడు వివరించారు. అన్నదాన సత్రం స్థల పరిశీలన, దేవాలయ మ్యుజియం పరిశీలన, అప్రోచ్ రోడ్డుకు సంబంధించి ఆక్రమణకు గురైన నివాస స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం 20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న ప్రసాద్ స్కీం మూడంతస్తుల భవనాన్ని పరిశీలించారు.  జరుగుతున్న నిర్మాణపనుల పురోగతి వివరాలను పరిశీలించారు. ఆయా వివరాలను సంబంధిత పర్యాటకశాఖ డిఈ ధనరాజ్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.  తదనంతరం అధికారులతో సమీక్ష సమావేశం  హేమలపురం సదన్ లో దేవాదాయ శాఖ. మునిసిపల్ కేంద్ర పురాతత్వ శాఖ, పర్యాటక శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఆయా శాఖల వారీగా నెలకొన్న ఇబ్బందులు సమస్యలు పరిష్కార మార్గాలపై సమావేశం నిర్వహించి పలు సూచనలు  చేశారు.  ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్  శ్రీనివాస్ రెడ్డి, ఇ ఓ పురంధర్ కుమార్, ఇరిగేషన్ ఈ ఈ విజయ్ కుమార్ రెడ్డి, పర్యాటకశాఖ డిఈ ధనరాజ్. కేంద్ర పురాతత్వ శాఖ రాష్ట్ర అసిస్టెంట్ సూపర్డెంట్ రోహిణి, ఏఈ శరవణన్  మున్సిపల్ కమిషనర్ నిత్యానందం, ఇన్చార్జి తహసిల్దార్ సుభాష్ నాయుడు, సంబదిత అధికారులు తదితరులు  ఉన్నారు.