కాఫీ లుక్ టీ పాయింట్ ఎమ్మెల్యే ప్రారంభించిన

కాఫీ లుక్ టీ పాయింట్ ఎమ్మెల్యే ప్రారంభించిన

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డులో కాఫీ లుక్  టీ పాయింట్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రిబ్బన్  కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. షాప్ యజమాని ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించడం జరిగినది. కాఫీ లుక్ లో నాయకులతో కలిసి ఎమ్మెల్యే టీ తాగడం జరిగినది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ మురళి, నరహరి గౌడ్, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భగీరథ వంశీ, కురుమన్న, సీతారాములు, రాజు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు