రెండు పడకల గదులకు రంగం సిద్ధం

రెండు పడకల గదులకు రంగం సిద్ధం

60 మంది అర్హులైన దివ్యంగులకు లక్కీడిప్ ద్వారా కేటాయిపు.

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి: జిల్లా పాత మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో అర్హులైన దివ్యంగులకు ముఖ్య అతిధుల చేతులమీదుగా గద్వాల ఆర్డీఓ రాములు, డిఎస్పీ రంగస్వామి,  సమక్షంలో లక్కీడిప్ ద్వారా రెండు పడకల గదులు కేటాయించడానికి రంగం సిద్ధం చేశారు.

మండల ప్రజా పరిషత్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుస్తూ జాగ్రత్తలో భాగంగా భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్త్ నిర్వహించారు. రెవిన్యూ అధికారితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.