30లక్షల వ్యయం తో సీ.సీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే 

30లక్షల వ్యయం తో సీ.సీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే 

ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని 30 లక్షల వ్యయంతో  సి.సి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,  భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగినది.  ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్. నేతృత్వంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణాలు డ్రైనేజీ నిర్మాణాలు గ్రామపంచాయతీ భవనలు ఏర్పాటు చేసిన, వైకుంఠ ద్వారాలు డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక భవనం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలో గతంలో కన్నా ఇప్పుడు అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది అని తెలిపారు. భవిష్యత్తులో పట్టణాలకు దీటుగా గ్రామాలను తీర్చిదిద్దామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, పాక్స్  ఛైర్మన్ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బజారి, రాము, కురుమన్న నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.