రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన నర్సమ్మ మరణించారు వారి కుటుంబ సభ్యులకు భర్త పాంటయ్య కు ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. చేతుల మీదుగా రైతు బీమా ద్వారా 5 లక్షలు రూపాయలు చెక్కును అందజేశారు.
ఆపద స్థితిలో ఉన్న మమ్మల్ని ఆదుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భగవంతు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, జంగల్ప తదితరులు పాల్గొన్నారు.