సీఎం సహాయనిధి 12,000 చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ 31 వార్డ్ చెందిన లబ్దిదారులు అబ్దుల్ రషీద్ తండ్రి ఇమామ్ సాబ్ చికిత్స నిమిత్తం కీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేతుల మీదుగా సీఎం సహాయనిధి 12,000 రూపాయల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.