జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

జోగులంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి-అల్లంపూర్ : vమహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడానికి విచ్చేసిన కల్వకుంట్ల కవిత కి గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి  స్వాగతం పలికి ఆమెకు శాలువా ఇచ్చి పుష్పగుచ్చం అందజేశారు. ఆలయం చేరుకొని విశేష పూజలు నిర్వహించే స్వామి అమ్మవారిని దర్శించుకుని అనంతరం ఆలయ అభివృద్ధి పై జరిగిన రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే అబ్రహం, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి మందా జగన్నాధం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్, రాష్ట్ర  వినియోగదారుల ఫోరం ఛైర్మెన్ గట్టు తిమ్మప్ప, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట రామిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.