దెబ్బతిన పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : కేటిదొడ్డి మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన వరి పంటలను బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఏడిఏ సంగీతలక్ష్మీ పరిశిలించారు. వెంకటాపురం గ్రామంలో వరిపంటలను పరిశీలించి, రైతుల నుంచి వివరాలు సేకరించారు.
గ్రామాల్లోని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పంట నష్ట అంచనాలను తయారు చేసి తద్వారా ఉన్నతాధికారులకు నివేదికను పంపిలని సూచించారు. ప్రభుత్వానికి పూర్తి నివేధిక అందిస్తామని అధికారులు వెల్లడించారు. వారి వెంటా కేటిదొడ్డి ఏఓ మహాలక్ష్మీ, ఏఈఓ శివ, రైతులు యుగేందర్ నర్సింహులు, వీరేష్ ఉన్నారు.