చింద్రమైన బతుకులు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చింద్రమైన బతుకులు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : పొట్టకూటికోసం ఊరూరు తిరుగుతూ ఇంటి ఇంటికి వెళ్లి పాత బట్టలు తీసుకుని వంట పాత్రలు సామాగ్రి అమ్ముకుని జీవనం సాగించే ఆ కుటుంబాని బలి తీసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా. ధరూర్ మండలం పారుచర్ల స్టేజ్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం  బలైంది. పూర్తి వివరాలు. గద్వాల టౌన్ 7వార్డు కు చెందిన జమ్ములమ్మ (50) తన కుమారుడు, అర్జున్ (24), కోడలు వైషాలీ(22) పల్లె పల్లెకు తిరుగుతూ వంట సామాగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇదే క్రమంలో శనివారం వీళ్లు ముగ్గురు కలిసి గద్వాల్ నుంచి ధరూర్ వెళ్లుతుండగా పారుచర్ల స్టేజ్ వద్ద ఓ బొలేరో వాహనం ఢీ కొట్టగా ఆటోలో వెళ్లుతున్న ఈ ముగ్గురు సంఘటన స్థలంలో మృతి చెందారు. బొలేరో వాహనం మితి మీరిన వేగంతో వెళ్లే సమయంలో ముందుగా వెళ్లుతున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న. ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి  గద్వాల్ డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ కర్నె శేఖర్ రెడ్డి, చేరుకొని పరిశిలించారు. క్షత్రగాత్రులను గద్వాల్ ఆసుపత్రికి తరలించారు.