గద్వాల ఎమ్మెల్యే కి  కృతజ్ఞతలు  తెలిపిన వాల్మీకి బోయ సోదరులు 

గద్వాల ఎమ్మెల్యే కి  కృతజ్ఞతలు  తెలిపిన వాల్మీకి బోయ సోదరులు 

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : సీఎం కేసీఆర్, అసెంబ్లీ సాక్షిగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని  ఏకగ్రీవంగా తీర్మానం చేసి  సందర్భంగా  వాల్మీకి బోయ సోదరులు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారికి గద్వాల టౌన్ చింతలపేట  చెందిన వాల్మీకి బోయ సోదరులు  మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి మిఠాయి తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే కి బిఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బి.యస్ కేశవ్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీతారాములు, తిమ్మప్ప, వెంకటేష్, రామకృష్ణ, రాజు, వాల్మీకి బోయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు