జోడి ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ

జోడి ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణమ్మ కి పుష్పగుచం అందజేసి ఘనంగా స్వాగతం పలికిన జోగులంబా గద్వాల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు, తెలుగు పేట లో మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కబీర్ దాస్ నర్శింహులు, ఆధ్వర్యంలో నిర్వహించిన జోడి ఎద్దుల బండలాగుడు పోటీలకు ముఖ్య అతిథిలుగా పాల్గొని, వృషభ లకు పూజా కార్యక్రమం నిర్వహించి, పోటీలను ప్రారంభించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణమ్మ. అనంతరం కార్యక్రమం ప్రారంభించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణమ్మ ని శాలువతో  సన్మానించిన రైతులు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం క్రిష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రా రెడ్డి,గద్వాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ టపాల రామాంజ నేయులు, బీజేపీ గద్వాల పట్టణ అధ్యక్షులు బండల వెంకట్రాములు, బీజేవైయం జిల్లా అధ్యక్షులు మీర్జాపూర్ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మత్స్యశాఖ కన్వీనర్ లక్ష్మన్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు జమ్మిచెడ్ ఆనంద్, గద్వాల మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మల్దకల్ మండల అధ్యక్షులు అల్వాల రాజశేఖర్ రెడ్డి, బీజేవైయం జిల్లా ప్రధానకార్యదర్శి గోసాయి హరిప్రసాద్, బీజేవైయం జిల్లా సెక్రటరీ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.