ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి: జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి, గద్వాల: ప్రజా ఫిర్యాదులను తహసీల్దార్ల పరిధిలో పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు, తహశీల్దార్లకు అదేశించరు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశం ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 75 ప్రజా ఫిర్యాదులను సమర్పించారని.
వాటిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలపై 69, ఆసరా పింఛన్లు 5, ఎలక్ట్రిసిటీ 1, ఇరిగేషన్, వికలాంగుల శాఖ తదితర సమస్యలకు సంబంధించి 6 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.