బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఆత్మ స్థైర్యం పెంచుతాయి
- బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి
ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో శని వారం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి పాల్గొన్నారు . స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఆత్మ స్థైర్యం పెంచుతుందని ఈ సంద్భంగా అన్నారు.